CPI: లోకేశ్‌తో ఫోన్‌లో మాట్లాడిన రామకృష్ణ

ABN , First Publish Date - 2023-09-11T13:31:32+05:30 IST

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఫోన్లో మాట్లాడారు.

CPI: లోకేశ్‌తో ఫోన్‌లో మాట్లాడిన రామకృష్ణ

అమరావతి: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో (TDP Leader Nara Lokesh) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (CPI Leader Ramakrishna) ఫోన్లో మాట్లాడారు. చంద్రబాబు అక్రమ అరెస్టు (Chandrababu Arrest) ఊహించని ఘటన అని అన్నారు. సీఐడీ పోలీసుల తీరు దుర్మార్గమని మండిపడ్డారు. ధైర్యం సడలకుండా మనోధైర్యంతో నిబ్బరంగా ఉండాలని లోకేశ్‌కు తెలిపారు. ఈ అంశంలో సీపీఐ అండగా ఉంటుందని స్పష్టం చేస్తున్నామన్నారు. ప్రజా ఉద్యమాలపై, ప్రతిపక్ష నేతలపై పోలీసుల దుందుడుకు తీరుపై రేపు (మంగళవారం) విజయవాడలో అఖిలపక్షాలు, ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ నిర్వహిస్తామని రామకృష్ణ పేర్కొన్నారు.


మరోవైపు టీడీపీ యువనేత లోకేశ్ రాజమహేంద్రవరంలోనే మకాం వేశారు. చంద్రబాబు బెయిల్ వ్యవహారంపై ఎప్పటికప్పుడు లీగల్ సెల్‌తో పాటు సీనియర్ న్యాయవాదులతో చర్చలు నిర్వహిస్తున్నారు. జైలు సూపర్డెంట్ నుంచి అనుమతి వస్తే మూలాకత్‌కు వెళ్లే ఆలోచనలో లోకేశ్ ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-09-11T13:31:32+05:30 IST