Share News

CM JAGAN: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్‌

ABN , First Publish Date - 2023-10-20T19:27:30+05:30 IST

రేపు పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి (CM JAGAN) పాల్గొననున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో కార్యక్రమం చేపడతారు.

CM JAGAN: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్‌

అమరావతి: రేపు పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి (CM JAGAN) పాల్గొననున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో కార్యక్రమం చేపడతారు. ఉదయం 8 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. తర్వాత ప్రసంగం అనంతరం పోలీస్‌ అమరవీరులకు సీఎం జగన్ శ్రద్ధాంజలి ఘటించనున్నారు.

కార్యక్రమం అనంతరం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమం అనంతరం ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి రాజ్‌భవన్‌కు సీఎం జగన్ వెళ్తారు. అక్కడ గవర్నర్‌ను కలిసిన అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రానికి జగన్ వెళ్లనున్నారు. అక్కడ ఏపీ హైకోర్టు నూతన జడ్జిల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకోనున్నారు.

Updated Date - 2023-10-20T19:28:22+05:30 IST