Padayatra: ప్రజల్లో వైసీపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉంది: లోకేష్

ABN , First Publish Date - 2023-02-01T14:12:58+05:30 IST

చిత్తూరు జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్ర (Padayatra) 6వ రోజు బుధవారం ఉదయం కమ్మనపల్లె నుంచి ప్రారంభించారు.

Padayatra: ప్రజల్లో వైసీపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉంది: లోకేష్

చిత్తూరు జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్ర (Padayatra) 6వ రోజు బుధవారం ఉదయం కమ్మనపల్లె నుంచి ప్రారంభించారు. ఈ సందర్బంగా కొలమసానిపల్లె దగ్గర మహిళలతో లోకేష్‌ భేటీ అయ్యారు. అ

నంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల్లో వైసీపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. సైకో పాలనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలను తీరుస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. కాగా ఈ సాయంత్రం 5:45 గంటలకు గొల్లపల్లి దగ్గర ఎస్సీ ప్రముఖులతో భేటీ కానున్నారు. రాత్రికి రామాపురం ఎమ్మోస్ హాస్పటల్ దగ్గర లోకేష్‌ బస చేస్తారు.

అంతకుముందు లోకేష్ పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లె మండలం, బేలుపల్లెలో వాల్మీకి సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వల్ల ఎలాంటి ఇబ్బందు పడుతోంది వారు లోకేష్‌‌కు వివరించారు. వాల్మీకిలను సీఎం జగన్ నమ్మించి మోసం చేశారన్నారు. ఎస్టీల్లో చేర్చే అంశంపై అసలు స్పందించడం లేదన్నారు. ‘‘రుణాలు లేవు, ఉద్యోగాలు లేవు. గ్రామాల్లో వాల్మీకి యువత కర్ణాటక, తమిళనాడు వెళ్లి బ్రతుకుతున్నాం’’ అంటూ వాల్మీకి సోదరులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలపై స్పందించిన లోకేష్.. టీటీపీ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కాగా లోకేష్ పాదయాత్రకు భారీగా ప్రజాదరణ లభిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎదురొచ్చి మంగళహారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. పెద్దసంఖ్యలో అభిమానులు, పార్టీ శ్రేణులు పాదయాత్రలో పాల్గొంటున్నారు. అభిమాన నేతతో కలిసి పార్టీ శ్రేణులు సెల్ఫీలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రతీరోజు అనుకున్న ప్రకారం 10 కిలోమీటర్ల కంటే రెండు, మూడు కిలోమీటర్లు ఎక్కువగానే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రకు వస్తున్న విశేష స్పందనతో ప్రజల విన్నపం మేరకు కిలోమీటర్లను మరింత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-02-01T14:13:02+05:30 IST