Chinarajappa: ఎంత మంది వైసీపీ ఎమ్మేల్యేలు టీడీపీలోకి వస్తారో చెప్పలేను కానీ..

ABN , First Publish Date - 2023-04-09T13:19:25+05:30 IST

తిరుమల: ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తున్నామంటూనే.. దేవాలయాల్లో ధరలు మాత్రం పెంచేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప (Nimmakayala Chinarajappa) విమర్శించారు.

Chinarajappa: ఎంత మంది వైసీపీ ఎమ్మేల్యేలు టీడీపీలోకి వస్తారో చెప్పలేను కానీ..

తిరుమల: ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తున్నామంటూనే.. దేవాలయాల్లో ధరలు మాత్రం పెంచేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప (Nimmakayala Chinarajappa) విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్‌ పాలనలో (Jagan Govt.) రాష్ట్రం అప్పులపాలైందన్నారు. ఏపీకి చంద్రబాబు (Chandrababu) అవసరం ఉందని ప్రజలు గుర్తించారన్నారు. జనసేనా (Janasena), టీడీపీ (TDP) పొత్తుపై అధినాయకత్వం మాట్లాడుతుందని.. కలిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సొంత ఎమ్మెల్యేలకు జగన్‌పై నమ్మకం లేకపోతే.. 175 సీట్లు గేలుస్తామనడం హస్యాస్పదమన్నారు. ఎమ్మేల్యేలను కొనేంత డబ్బు టీడీపీ పార్టీ వద్ద లేదని, నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలనే జగన్ కోనుగోలు చేశారన్నారు. ఎంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారో చెప్పలేను కానీ.. చాలా మంది ఎమ్మెల్యేలు వైసీపీ అధినాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారని ఎమ్మేల్యే చిన్నరాజప్ప అన్నారు.

Updated Date - 2023-04-09T13:19:25+05:30 IST