AP HighCourt: ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్పై విచారణ వాయిదా
ABN , First Publish Date - 2023-11-29T12:58:49+05:30 IST
Andhrapradesh: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్పై ఈరోజు (బుధవారం) హైకోర్టు విచారణ జరిగింది. చంద్రబాబు తరపున ఇప్పటికే సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు.
![AP HighCourt: ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్పై విచారణ వాయిదా](https://media.andhrajyothy.com/media/2023/20231102/chand_highcourt_2020984765.jpg)
అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో (IRR Case) టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి (డిసెంబర్ 1) వాయిదా వేసింది.
కాగా.. చంద్రబాబు తరపున ఇప్పటికే సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. ఐఆర్ఆర్ మాస్టర్ ప్లాన్లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ (CID) కేసు నమోదు చేసిన విషయం తెలిసందే. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణకు రాగా..