CBN House Custody : ముగిసిన వాదనలు.. మరో అరగంటలో కీలక తీర్పు

ABN , First Publish Date - 2023-09-11T16:05:33+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ రిమాండ్‌పై ఏసీబీ కోర్టులో ఇరువర్గాల వాదనలు ముగిసాయి. ఆదివారం జరిగిన వాదనలను మించి ఇవాళ వాడివేడిగా వాదనలుసాగాయి...

CBN House Custody : ముగిసిన వాదనలు.. మరో అరగంటలో కీలక తీర్పు

టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ రిమాండ్‌పై ఏసీబీ కోర్టులో ఇరువర్గాల వాదనలు ముగిసాయి. ఆదివారం జరిగిన వాదనలను మించి ఇవాళ వాడివేడిగా వాదనలుసాగాయి. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy).. చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddartha Luthra) వాదనలు వినిపించారు. సుమారు రెండు గంటలకు పైగా ఇరువర్గాల వాదనలను వినిపించినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో అనగా 04:30 గంటలకు హౌస్ రిమాండ్‌పై ఏసీబీ కోర్టు కీలక తీర్పు వెల్లడించనుంది. తీర్పు అనుకూలంగా వస్తుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్యం చేస్తోంది. అయితే.. సీఐడీ మాత్రం హౌస్ రిమాండ్ ఇచ్చే ప్రసక్తే వద్దని.. అసలు సీఆర్పీసీలో అదేమీ లేదని చెబుతోంది.


వాట్ నెక్స్ట్

మరోవైపు.. తీర్పు పరిణామాలను బట్టి హౌస్ రిమాండ్‌పై హైకోర్టు వెళ్లే యోచనలో లూథ్రా టీమ్ ఉంది. మరోవైపు.. హౌస్ కస్టడీ పిటిషన్ తర్వాత టీడీపీ నేతలు వేసిన బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టు తీర్పుపై మరోసారి టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. అంతా మంచే జరగాలని టీడీపీ కార్యకర్తలు, వీరాభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

NCBN Arrest : చంద్రబాబు కేసుపై ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు.. లూథ్రా టీమ్ ఏం చేయబోతోంది..!?


Updated Date - 2023-09-11T16:46:51+05:30 IST