AP News: విషాదం.. ఇద్దరు యువకుల మృతి

ABN , First Publish Date - 2023-05-21T18:53:35+05:30 IST

జిల్లాలోని ఆలమూరు మండలం జొన్నాడ గౌతమి గోదావరిలో విషాద ఘటన చోటుచేసుకుంది.

AP News: విషాదం.. ఇద్దరు యువకుల మృతి

అంబేద్కర్ కోనసీమ: జిల్లాలోని ఆలమూరు మండలం జొన్నాడ గౌతమి గోదావరిలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్నానానికి వెళ్ళి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ముక్కామలకు చెందిన మోటూరి త్రిలోక్(15) ఇంటర్ విద్యార్థి కొత్తపేటకు చెందిన గెడ్డం కరణాకర్(23) మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనా ప్రాంతంలో మృతదేహాలు లభ్యమైయ్యాయి. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఆరుగురు స్నానానికి వెళ్ళగా ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఇసుక ర్యాంపు కోసం తీసిన గోతుల్లో మునిగి మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2023-05-21T18:53:35+05:30 IST