Amaravati: మంగళగిరి ఎమ్మార్వో రాం ప్రసాద్కు అరుదైన అదృష్టం
ABN , First Publish Date - 2023-05-24T16:14:00+05:30 IST
మంగళగిరి ఎమ్మార్వో రాం ప్రసాద్కు అరుదైన అదృష్టం దక్కింది. ఒకటి కాదు రెండు సంతకాలు కాదు ఏకంగా 38 వేల పైచిలుకు ఇళ్లు పట్టాల పంపిణీకి సంతకం చేసే అరుదైన అవకాశం లభించింది.
గుంటూరు: మంగళగిరి ఎమ్మార్వో రాం ప్రసాద్కు అరుదైన అదృష్టం దక్కింది. ఒకటి కాదు రెండు సంతకాలు కాదు ఏకంగా 38 వేల పైచిలుకు ఇళ్లు పట్టాల పంపిణీకి సంతకం చేసే అరుదైన అవకాశం లభించింది. రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. దానిలో ఎక్కువ శాతం భూమి మంగళగిరి మండలంలో ఉండటంతో లబ్ధిదారుల పట్టాలపై మంగళగిరి ఎంఆర్ఓ రాంప్రసాద్ 38 వేలకు పైగా సంతకాలు చేశారు. తన 38 సంవత్సరాల రెవెన్యూ సర్వీస్లో 38వేల పైగా లబ్ధిదారుల పట్టాలపై ఏకకాలంలో సంతకాలు చేయడం తన అదృష్టం అని ఆయన తెలిపారు.