AP News: గోరంట్ల‌ నోట తెలంగాణ మాట

ABN , First Publish Date - 2023-03-29T18:12:24+05:30 IST

తెలంగాణ (Telangana) కు తెలుగుదేశం (TDP) పార్టీ అవసరం ఉందని సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) అన్నారు.

AP News: గోరంట్ల‌ నోట తెలంగాణ మాట

హైదరాబాద్: తెలంగాణ (Telangana) కు తెలుగుదేశం (TDP) పార్టీ అవసరం ఉందని సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) అన్నారు. చంద్రబాబు వేసిన పునాదుల వలనే తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉందని కొనియాడారు. నాయకులు వెళ్ళిపోయినా.. తెలంగాణలో కార్యకర్తలు పార్టీని కాపాడుకుంటున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ నీటిపారుదల రంగం అభివృద్ధి.. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు.. పేదలకు విద్యుత్ అందించిన ఘనత ఎన్టీఅర్‌దే (NTR) అని అన్నారు. ఏపీని గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతో తెలంగాణపై చంద్రబాబు (Chandrababu) దృష్టిని తగ్గించారని తెలిపారు.

ఇదిలావుండగా.... టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra)కు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి (Former MP JC Diwakar Reddy) సంఘీభావం ప్రకటించారు. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra) లో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం (YCP Government) పై ప్రజలు అసహ్యంతో ఉన్నారన్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్ వెంట ప్రజలు నడుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకత పాదయాత్రలో కనిపిస్తుందని అన్నారు. ప్రజలు రోడ్లపై రావడానికి సిద్ధంగా ఉన్నారని.. జగన్ మీద ఉన్న వ్యతిరేకతతోనే ఎమ్మెల్సీ ఎన్నికలను స్వీప్ చేశారన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్పేది కరెక్టే అని అన్నారు. ప్రభుత్వం ఆ విధంగా చేస్తుంది అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-03-29T18:12:24+05:30 IST