JC Diwakar Reddy: రేపు ప్రభుత్వం మారితే జగన్ నీ గతి ఏంటో తెలుసుకో

ABN , First Publish Date - 2023-09-22T14:59:27+05:30 IST

అనంతపురం: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వతహాగా శాంతిపరుడని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. విచ్చిన్నకర శక్తులు.. ఆరాచకాలకు దిగారని ఆరోపించారు.

JC Diwakar Reddy: రేపు ప్రభుత్వం మారితే జగన్ నీ గతి ఏంటో తెలుసుకో

అనంతపురం: టీడీపీ అధినేత (TDP Chief), మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Ex CM Chandrababu Naidu) స్వతహాగా శాంతిపరుడని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి (JC Diwakar Reddy) వ్యాఖ్యానించారు. విచ్చిన్నకర శక్తులు.. ఆరాచకాలకు దిగారని ఆరోపించారు. ఈ సందర్భంగా శుక్రవారం దివాకర్ రెడ్డి అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును ఎలాంటి విచారణ చేయకుండా జైల్లో వేశారని.. ఏ రాజ్యాంగంలో లేదని.. ఎలాంటి విచారణ చేపట్టలేదని.. చాలా అన్యాయమని అన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం జరిగితే కళ్లుమూసుకొని నిద్రపోయారా? అని ప్రశ్నించారు.

చంద్రబాబును చాలా ఇబ్బంది పెడుతున్నారని.. ఇలా చేస్తే ఏ ముఖ్యమంత్రి ప్రభుత్వం నడపలేరని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాజారికపాలన కంటే దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. రేపు ప్రభుత్వం మారితే జగన్ (Jagan) నీ గతి ఏంటో తెలుసుకోవాలని సూచించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని.. బాబుకు అండగా ఉందామని పిలుపిచ్చారు. జగన్ చేస్తున్న పనులు చూసి ప్రజలకు అసహ్యం కలుగుతోందన్నారు. జగన్ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. చంద్రబాబును రోజుల తరబడి జైల్లో పెడితే నిన్ను సంవత్సరాల పాటు జైల్లో పెడుతారని.. చంద్రబాబు జైలుకు పోయినా సానుభూతి కలుగుతుందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

Updated Date - 2023-09-22T15:00:32+05:30 IST