AP News : గంజాయి ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2023-09-30T13:11:29+05:30 IST

గంజాయి అమ్ముతున్న 18 మంది ముఠా సభ్యులను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్బీ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు.

AP News : గంజాయి ముఠా అరెస్ట్

అనంతపురం : గంజాయి అమ్ముతున్న 18 మంది ముఠా సభ్యులను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్బీ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి 21 కిలోల గంజాయి, 18 సెల్ ఫోన్లు రెండు ఆటోలు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం ఏజెన్సీ నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి అనంతపురంలో అక్రమంగా విక్రయాలు చేస్తున్నారన్నారు. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవల్లో గంజాయి రవాణా ముఠా బాగోతాన్ని బట్టబయలైందని ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు.

Updated Date - 2023-09-30T13:11:29+05:30 IST