Tadipatri: జేసీ సోదరులను తలుచుకోనిదే నిద్ర పట్టదా పెద్దారెడ్డి.. తాడిపత్రిలో కరపత్రాల కలకలం

ABN , First Publish Date - 2023-05-29T10:50:26+05:30 IST

జిల్లాలోని తాడిపత్రిలో మరోసారి కరపత్రాలు కలకలం సృష్టించాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మూడో విడత ప్రజా సంక్షేమ యాత్ర నేటితో ముగియనుంది.

Tadipatri: జేసీ సోదరులను తలుచుకోనిదే నిద్ర పట్టదా పెద్దారెడ్డి.. తాడిపత్రిలో కరపత్రాల కలకలం

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో మరోసారి కరపత్రాలు కలకలం సృష్టించాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (MLA Ketireddy Peddareddy) మూడో విడత ప్రజా సంక్షేమ యాత్ర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా తాడిపత్రిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈరోజు భారీ బహిరంగ సభ ఉండటంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ అయ్యాయి.

కరపత్రాలలో ఏముందంటే...

‘‘తాడిపత్రిలో బోకులు బోలెలు ఎక్కడ ఉన్నాయి అని పెద్దారెడ్డి... 10 రోజులు ఆలస్యంగా ఎందుకు పాదయాత్ర చేశావు చెప్పు పెద్దారెడ్డి.. తాడిపత్రి ప్రాంతంలో చెట్ల నరికివేతకు బ్రాండ్ అంబాసిడర్ కేతిరెడ్డి కుటుంబం కాదా!.. నేరస్థులకు ఆశ్రయం ఇచ్చే సంస్కృతి నీదే కదా పెద్దారెడ్డి!.. రోజూ జేసీ సోదరులను తలచుకోకుంటే నీకు నిద్ర పట్టదు పెద్దారెడ్డి!.. ప్రజల కోసం ఏం చేశావో చెప్పుకునేందుకు నీకు ఏమీ లేదు. దోచుకోవడం దాచుకోవడం గురించి నువ్వు మాట్లాడితే బాగుండదు. నీ కార్యకర్తలకు, నాయకులకు మైక్ ఇచ్చి చూడు ఏం చెబుతారో’’ అంటూ కరపత్రాలను ముద్రించి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కరపత్రాలు పంపిణీ చేయడంతో జేసే ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరులు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరపత్రాల పంపిణీపై ఆ నలుగురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2023-05-29T10:50:26+05:30 IST