Ramakrishna: నాలుగేళ్ళ పాలనలో అభివృద్ధి ఏం చేశారో సీఎం చెప్పాలి..

ABN , First Publish Date - 2023-06-02T11:28:30+05:30 IST

అనంతపురం: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇవాళ ఘనంగా చేసుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దురదృష్ట దినోత్సవం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

Ramakrishna: నాలుగేళ్ళ పాలనలో అభివృద్ధి ఏం చేశారో సీఎం చెప్పాలి..

అనంతపురం: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇవాళ ఘనంగా చేసుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దురదృష్ట దినోత్సవం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయం తక్కువగా ఉందని.. అభివృద్ధి లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి అభివృద్ధి అని చెప్పి వందల కోట్లు కాజేస్తున్నారని ఆరోపించారు. నాలుగేళ్ళ పాలనలో అభివృద్ధి ఏం చేశారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదించడానికి ఒప్పుకున్నారని, రాష్ట్రంలో ఎక్కడ ఒక్క ప్రాజెక్టు కట్టలేదన్నారు. సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధికి సమాధి కడుతున్నారని రామకృష్ణ ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టు సాధన కొరకు, నిర్వాసితులకు ఇళ్లు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 12వ తేదీ.. నుంచి పోలవరం ప్రాంతంలో పాదయాత్ర చేపడుతున్నామని వెల్లడించారు. అప్పులు చేస్తున్నా.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని .. ఏ రంగంలోనైనా అభివృద్ధి ఉందా.. అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దివాళా తీసే దిశగా పాలన సాగుతోందని, భారత దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారన్నారు. కమ్మ కులాలను టార్గెట్ చేసి... కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఈనాడు మార్గదర్శిలోను దాడులు చేయిస్తున్నారని, కులాల గురించి మాట్లాడుతూ.. వర్గాలపై పోరాడుతున్నామని అబద్దాలు చెప్తున్నారని రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - 2023-06-02T11:28:30+05:30 IST