AP News: చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మరో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2023-09-24T08:55:12+05:30 IST

శ్రీ సత్య సాయి జిల్లా: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక హిందూపురంలో టీడీపీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు.

AP News: చంద్రబాబు అరెస్టు తట్టుకోలేక మరో వ్యక్తి మృతి

శ్రీ సత్య సాయి జిల్లా: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక హిందూపురంలో టీడీపీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. ఎనిమిదవ వార్డు శ్రీకంఠపురంకు చెందిన టీడీపీ కార్యకర్త అంజినప్ప (80) గుండెపోటుతో మృతి చెందాడు. ఇంటిలో టీవీ వీక్షిస్తుండగా ఒక్కసారి గుండెపోటు రావడంతో మృతి చెందాడు.

కాగా చంద్రబాబు నాయుడు అరెస్టును తట్టుకోలేక కొవ్వూరుకు చెందిన పార్టీ కార్యకర్త, ఆయకట్టు సంఘం మాజీ అధ్యక్షుడు యర్రంశెట్టి సత్యనారాయణ (63) గుండెపోటుతో మృతిచెందారు. చంద్రబాబు అరెస్టయిన నాటి నుంచి ఆయన మానసిక వేదనకు గురయ్యేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. నాటి నుంచి దిగులుగా ఉన్న సత్యనారాయణ శనివారం ఉదయం వ్యవసాయ పనులు చూసుకుని ఇంటికి వచ్చిన వెంటనే గుండెపోటు రావడంతో కన్నుమూసినట్టు చెప్పారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు తదితరులు అతని కుమారుడు భాస్కరరావును ఫోన్‌లో పరామర్శించారు. అలాగే, టీడీపీ మండల అధ్యక్షుడు గుములూరు చంద్రమౌళి, మాజీ సర్పంచ్‌ కోలిపల్లి ఈశ్వరరావు, ఐటీడీపీ నాయకులు బంటు రాజు తదితరులు మృతదేహం వద్ద నివాళులర్పించారు.

Updated Date - 2023-09-24T08:55:12+05:30 IST