Gutta Sukhender Reddy: కేసీఆర్‌ను మానసికంగా దెబ్బకొట్టేందుకు మూకుమ్మడిగా దాడి

ABN , First Publish Date - 2022-12-02T09:59:17+05:30 IST

ఏడాది కాలంగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాల వెనుక సమైక్యవాదుల కుట్రలు ఉన్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.

Gutta Sukhender Reddy: కేసీఆర్‌ను మానసికంగా దెబ్బకొట్టేందుకు మూకుమ్మడిగా దాడి

నల్గొండ: ఏడాది కాలంగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాల వెనుక సమైక్యవాదుల కుట్రలు ఉన్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Legislative Council Chairman Gutta Sukhender Reddy) ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్‌ (Telangana KCR) ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో చేతకాక తెలంగాణ(Telangana) లో ప్రజలను మభ్య పెట్టి కేసీఆర్‌ను అడ్డు తొలగించుకోవాలని మళ్ళీ కబ్జా చేసేందుకు వస్తున్నారన్నారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక ఏడు మండలాలు ఏపీలో కలిపారని తెలిపారు. దేశంలో ప్రభుత్వాలను కూల్చేకుట్రలు, అనిశ్చితకరమైన వాతావరణం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీ దత్త పుత్రిక షర్మిల పాదయాత్రల పేరుతో కేసీఆర్‌ (TRS Chief) ను అప్రతిష్ట పాలు చేస్తోందని విమర్శించారు. అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లడమే కాకుండా ఐఏఎస్ అధికారులను కూడా జైలుకు పంపిన చరిత్ర వారిదని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-12-02T09:59:18+05:30 IST