Raghunandanrao: నిరుపేద ఆటోడ్రైవర్ డబుల్‌ బెడ్‌రూం ఇంటికి అర్హుడు కాదా?

ABN , First Publish Date - 2022-12-06T13:08:26+05:30 IST

నిరుపేద ఆటోడ్రైవర్ డబుల్‌ బెడ్‌రూం ఇంటికి అర్హుడు కాదా అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు.

Raghunandanrao: నిరుపేద ఆటోడ్రైవర్ డబుల్‌ బెడ్‌రూం ఇంటికి అర్హుడు కాదా?

సిద్ధిపేట: నిరుపేద ఆటోడ్రైవర్ డబుల్‌ బెడ్‌రూం ఇంటికి అర్హుడు కాదా అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూంల కేటాయింపులో కక్ష్య పూరితంగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురై కలెక్టరేట్ ముందు ఆత్మహత్య చేసుకున్న రమేష్ మృతదేహానికి బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. సిద్దిపేటలో డబుల్‌బెడ్‌రూం ఇల్లు రావాలంటే ఎన్ని అవినీతి పనులు చేయాలో రమేష్‌ మృతి విషయంలో తెలుస్తోందన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలపై విచారణ జరిపి ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ... కేసీఆర్ ఇలాకాలో దళితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. పోలీసులతో బెదిరించి విషయం బయటకు పొక్కకుండా దాస్తున్నారని విమర్శించారు. ధరణి కారణంగా ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉంటేనే సంక్షేమ పథకాలు ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడిపిస్తున్న కేసీఆర్ వారికి న్యాయం చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-12-06T13:08:27+05:30 IST