Telangana Congressలో భగ్గుమన్న అసంతృప్తి జ్వాలలు

ABN , First Publish Date - 2022-12-13T12:40:42+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టీపీసీసీ కమిటీల ప్రకటనతో కాంగ్రెస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Telangana Congressలో భగ్గుమన్న అసంతృప్తి జ్వాలలు

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress)లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టీపీసీసీ కమిటీల ప్రకటనతో కాంగ్రెస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మెదక్ జిల్లాలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదరం రాజనర్సింహ (Former Deputy Chief Minister Damodaram Rajanarsimha) కు చెందిన ఎవరికీ కూడా టీపీసీసీ కమిటీ (TPCC Committees) ల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపణ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దామోదరం రాజనర్సింహ నేతృత్వంలో మెదక్ జిల్లా నేతలు గాంధీభవన్‌లో భేటీ అయ్యారు. గాంధీభవన్ నుంచి నేరుగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు నేతలు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు దామోదర రాజనర్సింహ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర, ఢిల్లీ నేతలు స్పందించకుంటే రెండు, మూడు రోజుల్లో తమ కార్యచరణ ప్రకటిస్తామని నేతలు చెబుతున్నారు. పార్టీని వీడడానికైనా సిద్ధమని, తమ దారి తాము చూసుకుంటామని నేతలు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - 2022-12-13T12:40:43+05:30 IST