TS News: రాజేంద్రనగర్‌లో వ్యాపారవేత్త కిడ్నాప్‌కు యత్నం

ABN , First Publish Date - 2022-12-30T10:29:57+05:30 IST

జిల్లాలోని రాజేంద్రనగర్‌లో వ్యాపారవేత్త కిడ్నాప్‌ యత్నం కలకలం రేపుతోంది.

TS News: రాజేంద్రనగర్‌లో వ్యాపారవేత్త కిడ్నాప్‌కు యత్నం

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్‌లో వ్యాపారవేత్త కిడ్నాప్‌ యత్నం కలకలం రేపుతోంది. హీరో షోరూమ్ యజమాని సాయి కిరణ్‌కు మత్తు మందు ఇచ్చి కారులో కిడ్నాప్ చేసేందుకు దుండగులు యత్నించారు. కిస్మత్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త తన కారులో షో రూమ్‌కు పయనమయ్యారు. కిస్మత్ పూర్ బ్రిడ్జ్ దాటగానే వాష్‌రూమ్‌ అంటూ డ్రైవర్ కారును ఆపాడు. ఒక్కసారిగా కారులోకి ఎక్కిన ముగ్గురు సభ్యులతో కూడిన గ్యాంగ్... సాయి కిరణ్‌కు మత్తు మందు ఇచ్చి మాస్క్ పెట్టారు. అనంతరం డ్రైవర్.. కారు స్టార్ట్ చేసి అత్తాపూర్ వైపు తీసుకెళ్లాడు. డ్రైరీ ఫామ్ వద్దకు రాగానే సాయికిరణ్ వెంటనే తేరుకుని కారులో నుంచి కిందకు దూకేశాడు. హుటాహుటిన 100 డయల్ చేసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశాడు. వెంటనే అప్రమత్తమైన శంషాబాద్ ఎస్ఓటి బృందం ఎంతో చాకచక్యంగా వ్యహరించి కిడ్నాపర్స్‌ను పట్టుకున్నారు. మరికాసేపట్లో కిడ్నాపర్స్‌ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. సాయి కిరణ్‌ను కిడ్నాప్ చేసి డబ్బులు లాగుదామనుకున్న కిడ్నాపర్స్ ప్లాన్‌ను పోలీసులు భగ్నం చేశారు.

Updated Date - 2022-12-30T10:29:58+05:30 IST