CM KCR : ‘మునుగోడు’లో ప్రతి హామీని నెరవేర్చాలి

ABN , First Publish Date - 2022-11-08T05:41:35+05:30 IST

మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని, సంబంధిత కార్యాచరణను వెంటనే ప్రారంభించాలని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

CM KCR : ‘మునుగోడు’లో ప్రతి హామీని నెరవేర్చాలి

ఆయా మంత్రులతో సమన్వయం చేసుకోండి

నల్లగొండ ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని, సంబంధిత కార్యాచరణను వెంటనే ప్రారంభించాలని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇందుకోసం ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ విజయం కోసం కృషి చేసిన నేతలను కేసీఆర్‌ అభినందించారు. మునుగోడు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డికి సూచించారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్‌, కంచర్ల భూపాల్‌ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గొంగిడి సునీత, బొల్లం మల్లయ్య యాదవ్‌, జీవన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, సైదిరెడ్డి, రవీంద్ర కుమార్‌ నాయక్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-11-08T05:41:36+05:30 IST