Minister KTR: హైదరాబాద్‌లో ఏ మూలకు పోయినా పచ్చదనమే

ABN , First Publish Date - 2022-12-06T12:16:54+05:30 IST

ఇప్పుడు హైదరాబాద్‌లో ఏ మూలకు పోయినా పచ్చదనం కనిపిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Minister KTR: హైదరాబాద్‌లో ఏ మూలకు పోయినా పచ్చదనమే

హైదరాబాద్: ఇప్పుడు హైదరాబాద్‌లో ఏ మూలకు పోయినా పచ్చదనం కనిపిస్తోందని మంత్రి కేటీఆర్‌ (Minister KTR) అన్నారు. మంగళవారం ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.16 కోట్లతో ముక్తిఘాట్‌ నిర్మించామని తెలిపారు. రూ. 985 కోట్లతో నాలాల ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. ఫిర్జాదీగూడ దగ్గర రూ.52 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేశామని అన్నారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 14 బ్రిడ్జ్‌లు కట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Updated Date - 2022-12-06T12:16:57+05:30 IST