Kuruma community: సీఎం కేసీఆర్‌కు కురుమ సంఘం సన్మానం

ABN , First Publish Date - 2022-11-08T06:16:52+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలిచిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం సభ్యులు ముఖ్యమంత్రి

Kuruma community: సీఎం కేసీఆర్‌కు కురుమ సంఘం సన్మానం
సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే ప్రభాకర్‌ రెడ్డితో యెగ్గె మల్లేశం తదితరులు

అఫ్జల్‌గంజ్‌, నవంబర్‌ 7 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలిచిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సోమవారం కలిశారు. కురుమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేషం ఆధ్వర్యంలో ప్రగతిభవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్‌తోపాటు మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిని సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు క్యామ మల్లేష్‌, సెవెల్లి సంపత్‌, రాష్ట్ర యూత్‌ అధ్యక్షులు తూంకుంట అరుణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కురుమల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ విశేష కృషి చేస్తున్నారని యెగ్గె మల్లేషం ఈ సందర్భంగా అన్నారు.

Updated Date - 2022-11-08T06:16:54+05:30 IST