Jaggareddy: మల్లిఖార్జున ఖర్గేను కలుస్తా

ABN , First Publish Date - 2022-12-07T12:40:12+05:30 IST

కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలుస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.

Jaggareddy: మల్లిఖార్జున ఖర్గేను కలుస్తా

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjuna Kharge is the new president of Congress)ను కలుస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు, పార్టీ బలోపితం అంశంపై ఖర్గే‌తో చర్చించనున్నట్లు చెప్పారు. కమిటీలు కూడా త్వరలో వెలువడనున్నాయని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేది కాంగ్రెస్ మాత్రమే అని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీ అధికారాన్ని వినియోగించుకొని ఒకరిపై ఒకరు విమర్శలు మాత్రమే చేసుకుంటున్నారని అన్నారు. బీజేపీ అంత స్ట్రాంగ్‌గా ఉంటే కాంగ్రెస్ నేతలను ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించరాు. కాంగ్రెస్‌లో ఎలాంటి అంతర్గత విబేధాలు లేవని తేల్చిచెప్పారు. పీసీసీ అధ్యక్ష స్థానంలో ఎవరున్నా వారి పిలుపు మేరకు ముందుకు వెళ్తామని అన్నారు. రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణ విజయవంతం అయ్యిందన్నారు. త్వరలో తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజల్లోకి వెళ్తామని జగ్గారెడ్డి తెలిపారు.

Updated Date - 2022-12-07T12:44:37+05:30 IST