Mallu Ravi: ఆ ముగ్గురికి అమ్ముడుపోవడం అలవాటు

ABN , First Publish Date - 2022-12-30T15:23:11+05:30 IST

కాంగ్రెస్‌ (Congress)కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై సీబీఐ డైరెక్టర్‌ (CBI Director)కు ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు

Mallu Ravi: ఆ ముగ్గురికి అమ్ముడుపోవడం అలవాటు
అమ్ముడుపోవడం అలవాటు

హైదరాబాద్: కాంగ్రెస్‌ (Congress)కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై సీబీఐ డైరెక్టర్‌ (CBI Director)కు ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి (Mallu Ravi) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 12 మంది ఎమ్మెల్యేలు ఒకే రోజు టీఆర్ఎస్‌లో చేరలేదని తెలిపారు. ఒక్కొక్కరు ఒక్కోరోజు టీఆర్ఎస్‌ ((trs)లో చేరారని వెల్లడించారు. అయినా ఒక పార్టీని మరో పార్టీలో విలీనం చేయొచ్చా?.. అలా చేయడం కుదరదని చెప్పుకొచ్చారు. ఫాంహౌస్‌ (Farmhouse)లో ఎమ్మెల్యేల కొనుగోలు(MLAs Purchase Case)లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లినవారేనని తెలిపారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు అమ్ముడుపోవడం అలవాటుగా మారిందని ఆరోపించారు. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి వివిధ రూపాల్లో లబ్ధి పొందారని పేర్కొన్నారు. వాళ్లంతా ఎలా ఆర్థికంగా లబ్ధి పొందారో అన్ని వివరాలు సీబీఐకి ఇవ్వనున్నట్లు మల్లు రవి స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-30T15:23:14+05:30 IST