MP Arvind: రైతులను కూలీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే

ABN , First Publish Date - 2022-12-06T14:20:52+05:30 IST

తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ కమిటీ వేసిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.

MP Arvind: రైతులను కూలీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ కమిటీ వేసిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (BJP MP Dharmapuri Arvind) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కమిటీలో తనతో పాటు వివేక్, ప్రకాష్‌రెడ్డి, అజ్మీరా బాబీ ఉన్నారన్నారు. టీఆర్ఎస్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి ఈ నివేదిక కీలకంకానుందని అన్నారు. ప్రజాధనం దోచుకోవడం తప్ప.. టీఆర్ఎస్‌కు దేనిపైనా చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రైతులను కూలీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తప్పుడు వాగ్దానాలకు రైతులు బలవుతున్నారన్నారు. విద్యుత్ కొనుగోలులో భారీ స్కామ్ చేస్తున్నారని.. ఆ డబ్బులనే లిక్కర్ స్కామ్, ఫీనిక్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ లబ్దిదారుల జాబితాను కేసీఆర్ బయటపెట్టడం లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు గుప్పించారు.

Updated Date - 2022-12-06T14:20:53+05:30 IST