Dharmapuri Arvind: ఏపీని వెళ్లి మద్రాస్‌లో కలపండి

ABN , First Publish Date - 2022-12-09T13:01:57+05:30 IST

రెండు రాష్ట్రాలను కలపాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు.

Dharmapuri Arvind: ఏపీని వెళ్లి మద్రాస్‌లో కలపండి

న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాలను కలపాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. ‘‘ఒకప్పుడు ఆంధ్రా.. మద్రాస్ నుంచి విడిపోయింది. ఏపీని వెళ్లి మద్రాస్‌లో కలపండి. సజ్జల రామకృష్ణ ఏమన్నా ఎమ్మెల్యేనా. జగన్ సలహాదారుని మార్చుకో. ఇలాంటి వాళ్లను సలహాదారుడుగా జగన్ పెట్టుకుంటాడా. మా తెలంగాణపై ఎందుకు పడతారు. సజ్జల లాంటి సలహాదారున్ని జగన్ పెట్టుకుంటాడా?’’ అంటూ అరవింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2022-12-09T13:02:07+05:30 IST