New Zealand vs India: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసిన భారత్ బ్యాటర్లు.. కివీస్ ముందు ఈజీ టార్గెట్

ABN , First Publish Date - 2022-11-30T11:16:22+05:30 IST

భారత్, న్యూజిలాండ్ (New Zealand) మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరిదైన మూడో వన్డేలో (3rd ODI) మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 47.3 ఓవర్లలో కేవలం 219 పరుగులకే ఆలౌట్ అయింది.

New Zealand vs India: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసిన భారత్ బ్యాటర్లు.. కివీస్ ముందు ఈజీ టార్గెట్

క్రైస్ట్‌చర్చ్: భారత్, న్యూజిలాండ్ (New Zealand) మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరిదైన మూడో వన్డేలో (3rd ODI) మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 47.3 ఓవర్లలో కేవలం 219 పరుగులకే ఆలౌట్ అయింది. సిరీస్ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఒక్క వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) మాత్రం అర్ధశతకంతో(51) రాణించాడు. అటు శ్రేయస్ అయ్యర్(49) పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లలో కెప్టెన్ శిఖర్ ధావన్(28), శుబ్‌మన్ గిల్(13), రిషబ్ పంత్(10), దీపక్ హూడా(12) పరుగులు చేశారు. దీంతో టీమిండియా (Team India) 47.3 ఓవర్లలో 219 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ ముందు 220 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ బౌలర్లలో ఆడం మిల్నే, మిచెల్ చెరో మూడు వికెట్లు తీస్తే, సౌథీ రెండు, ఫెర్గూసన్, శాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.

Updated Date - 2022-11-30T11:39:35+05:30 IST