Palla Rajeshwar Reddy: విషపు ఆలోచనలతోనే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-12-08T17:59:26+05:30 IST

విషపు ఆలోచనలతోనే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy) విమర్శించారు.

Palla Rajeshwar Reddy: విషపు ఆలోచనలతోనే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్: విషపు ఆలోచనలతోనే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy) విమర్శించారు. సజ్జల సాదాసీదాగా వ్యాఖ్యానించినట్లు తాము భావించట్లేదని పల్లా అన్నారు.వైసీపీ నేతల వ్యాఖ్యల వెనుక బీజేపీ కుట్ర ఉందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణపై కేఏ పాల్‌, షర్మిల లాంటి బాణాలను వదిలారని పల్లా మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని చూస్తుంటే కొందరికి కంటగింపుగా ఉందని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన వెనక్కి తీసుకోవాలని విషపు మాటలు మాట్లాడుతున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.

Updated Date - 2022-12-08T18:02:31+05:30 IST