Chandrababu: వైసీపీ నేతల భూ కుంభకోణాన్ని వదిలిపెట్టం.. రూ.6 వేల కోట్ల భూస్కామ్ జరిగింది

ABN , First Publish Date - 2022-11-18T18:53:57+05:30 IST

కర్నూలు శివారులోని టిడ్కో గృహాలను ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu naidu) సందర్శించారు. టీడీపీ హయాంలోనే 90 శాతం టిడ్కో గృహాలను పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు.

Chandrababu: వైసీపీ నేతల భూ కుంభకోణాన్ని వదిలిపెట్టం.. రూ.6 వేల కోట్ల భూస్కామ్ జరిగింది
చంద్రబాబు, ఏపీ మాజీ సీఎం

కర్నూలు: కర్నూలు శివారులోని టిడ్కో గృహాలను ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu naidu) సందర్శించారు. టీడీపీ హయాంలోనే 90 శాతం టిడ్కో గృహాలను పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. జగన్‌ (Jagan) సర్కార్‌ 10 శాతం ఇళ్లు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇళ్లు నిర్మించుకోవడానికి కేంద్రం రూ.1.80 లక్షలు అందిస్తే పేదలకు జగన్‌ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో రూ.6 వేల కోట్ల భూస్కామ్ జరిగిందని, తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతల భూ కుంభకోణాన్ని వదిలిపెట్టమని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-18T18:54:00+05:30 IST