Punjab: నలుగురు బీజేపీ నేతలకు ఎక్స్ కేటగిరి భద్రత కల్పించిన కేంద్రం

ABN , First Publish Date - 2022-11-19T17:01:17+05:30 IST

పంజాబ్‌‌లోని నలుగురు బీజేపీ నేతలకు 'ఎక్స్' కేటరిరి సీఆర్‌పీఎఫ్ భద్రతను కేంద్రం కల్పించింది. బీజేపీ నేతలకు ముప్పు ఉందనే ఇంటెలిజెన్స్..

Punjab: నలుగురు బీజేపీ నేతలకు ఎక్స్ కేటగిరి భద్రత కల్పించిన కేంద్రం

న్యూఢిల్లీ: పంజాబ్‌ (Punjab)లోని నలుగురు బీజేపీ (BJP) నేతలకు 'ఎక్స్' కేటరిరి (X category) సీఆర్‌పీఎఫ్ భద్రతను కేంద్రం కల్పించింది. బీజేపీ నేతలకు ముప్పు ఉందనే ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా వీరికి ఎక్స్ కేటగిరి భద్రతను కల్పించాలంటూ సీఆర్‌పీఎఫ్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం పంజాబ్ మాజీ మంత్రులు బల్బీర్ సింగ్ సిద్ధు, గుర్‌ప్రీత్ సింగ్ కంగ, మాజీ ఎమ్మెల్యే జగ్దీప్ సింగ్ నకయి, అమర్‌జిత్ సింగ్ టిక్కకు ఎక్స్‌ కేటగిరి భద్రత కల్పించారు. ఐబీ సమాచారంతోనే ఐదుగురు పంజాబ్ బీజేపీ నేతలకు గత అక్టోబర్‌లో కేంద్రం 'వై' కేటగిరి భద్రత కల్పించింది.

Updated Date - 2022-11-19T17:01:29+05:30 IST