Bandaru: ముఖ్యమంత్రికి ఉత్తరాంధ్రలో శవ రాజకీయాలేంటి?
ABN , First Publish Date - 2022-12-31T14:56:25+05:30 IST
సీఎం జగన్ (Cm jagan)పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి (Bandaru Satyanarayana Murthy) మండిపడ్డారు. ‘‘నర్సీపట్నం వచ్చి ఉత్తరాంధ్రలో ఏం అభివృద్ధి చేశారో చెప్పడం మానేసి
విశాఖ: సీఎం జగన్ (Cm jagan)పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి (Bandaru Satyanarayana Murthy) మండిపడ్డారు. ‘‘నర్సీపట్నం వచ్చి ఉత్తరాంధ్రలో ఏం అభివృద్ధి చేశారో చెప్పడం మానేసి శవ రాజకీయాలు చేస్తున్నారు. కందుకూరులో జరిగిన ఘటనను జగన్మోహన్రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారు. అసలు జగన్కు మానవత్వం ఉందా..? చంద్రబాబు (Chandrababu) సమావేశాలు చూసి జగన్కు భయం పట్టుకుంది. జైలుకు వెళ్లి వచ్చిన జగన్.. చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు లేదు. సుమారుగా జగన్ యాత్రలో పది మందికి పైగా చచ్చిపోయారు... ఒక్కరినైనా పరామర్శించారా? ఒకరినైనా ఆదుకున్నారా? నీ వల్ల నీ మనుషులు ఎంత మంది హత్యగావించబడ్డారు. కనీసం సాయం చేసావా? పరామర్శించావా..? భగవంతుడి మీద ఓట్టు వేసి మీ బాబాయ్ (YS. Vivekananda Reddy) హత్య నీకు తెలియదని చెప్పు. తండ్రి చనిపోతే అధికారం కోసం సంతకాలు చేయించి శవ రాజకీయం మొదలుపెట్టింది నీవుకాదా? సొంత పార్టీ ఎంపీ చనిపోతేనే పరామర్శించేందుకు వెళ్లలేదు. పరిటాల రవి (Paritala Ravi) హత్యకు కారకుడు నువ్వు కాదా? సీఐడీ (CID)ని ఉపయోగించి దొంగ కేసులు పెడుతున్నవారికి ప్రమోషన్లు ఇస్తున్నారు.’’ అంటూ బండారు ధ్వజమెత్తారు.