Adimulapu Suresh: రాజధానిపై సుప్రీం ఆదేశాలకు కట్టుబడి ఉండాలి

ABN , First Publish Date - 2022-11-30T15:53:21+05:30 IST

ఒకే ప్రాంతంలో రాజధాని నిర్మాణం కరెక్ట్ కాదని సుప్రీం కోర్టు చెప్పిందని మంత్రి ఆదిమూలపు సురేష్(Minister Adimulapu Suresh) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కోర్టులు ఇచ్చిన ఆదేశాలను శిరసావహించాల్సిన బాధ్యత ఉందని

Adimulapu Suresh: రాజధానిపై సుప్రీం ఆదేశాలకు కట్టుబడి ఉండాలి
ఆదేశాలకు కట్టుబడి ఉండాలి

ప్రకాశం: ఒకే ప్రాంతంలో రాజధాని నిర్మాణం కరెక్ట్ కాదని సుప్రీం కోర్టు చెప్పిందని మంత్రి ఆదిమూలపు సురేష్(Minister Adimulapu Suresh) అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కోర్టులు ఇచ్చిన ఆదేశాలను శిరసావహించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. పొరుగు రాష్ట్ర రాజకీయాలతో మాకు సంబంధం లేదని పేర్కొన్నారు. ప్రజా స్వామ్యాన్ని కాలరాసే కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా విమర్శిస్తామని చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా పరిపాలన జరుగుతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం జరిగినా అది కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు. వివేకానందరెడ్డి వైసీపీ నాయకుడు... ఆయన హత్య కేసులో దోషులెవరో తేల్చాల్సిందేనని డిమాండ్ చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందన్నారు. జనసేన పార్టీ భావజాలం ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలియాలన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయడమే అజెండా అనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు గెలవబోతున్నట్లు మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-11-30T15:53:22+05:30 IST