Karthika masam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2022-11-21T09:13:43+05:30 IST

కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైలం మల్లన్న స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Karthika masam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

నంద్యాల: కార్తీకమాసం (Kartika masam) చివరి సోమవారం కావడంతో శ్రీశైలం మల్లన్న స్వామి (Srisailam Temple) ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. పాతాళగంగ వద్ద భక్తుల సంఖ్య పెరిగింది. కృష్ణమ్మ వడిలో కార్తీక దీపాలను వెలిగించి మొక్కలు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ కారణంగా స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలు రద్దు అయ్యాయి. అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తూ.. గర్భాలయం అభిషేకాలను ఈవో లవన్న రద్దు చేశారు. కార్తీక సోమవారం సందర్భంగా సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం జరుగనుంది.

Updated Date - 2022-11-21T09:13:45+05:30 IST