AP News: శ్రీశైలం ఆలయం వద్ద దుకాణాల తరలింపుకు ముగిసిన గడువు

ABN , First Publish Date - 2022-12-16T13:48:45+05:30 IST

శ్రీశైలం ప్రధాన ఆలయానికి ఇరువైపుల గల దుకాణాల తరలింపుకు నేటితో గడువు ముగిసింది.

AP News: శ్రీశైలం ఆలయం వద్ద దుకాణాల తరలింపుకు ముగిసిన గడువు

నంద్యాల: శ్రీశైలం ప్రధాన ఆలయానికి ఇరువైపుల గల దుకాణాల తరలింపుకు నేటితో గడువు ముగిసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిరన అధికారులు... డిప్‌లో పాల్గొని లలితాంబికా కాంప్లెక్స్‌లోకి దుకాణాలు తరలించని పాత దుకాణాలకు విద్యుత్, నీటి సరఫరాను కట్ చేశారు. ఉన్నపలంగా వెళ్లమంటే ఎటు వెళ్లాలంటూ దేవస్థానం అధికారులతో దుకాణాల వ్యాపారులు వాగ్వాదానికి దిగారు. కాగా... పోలీసుల రంగ ప్రవేశంతో దుకాణాదారుల వ్యవహారం సద్దుమణిగింది. దుకాణాల తరలింపుకు దేవస్థానం అధికారులు మరో రెండు రోజుల పాటు సమయం ఇచ్చారు.

Updated Date - 2022-12-16T13:48:46+05:30 IST