TDP Protest: యనమలకుదురులో టీడీపీ నేతల అరెస్ట్‌కు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2022-11-22T13:09:37+05:30 IST

జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురులో ఉద్రిక్తత కొనసాగుతోంది.

TDP Protest: యనమలకుదురులో టీడీపీ నేతల అరెస్ట్‌కు రంగం సిద్ధం

కృష్ణా: జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ‘‘ఇదేం ఖర్మ-ఈ రాష్ట్రానికి’’ అంటూ బ్రిడ్జిపై టీడీపీ నేతల నిరసన చేపట్టారు. పెనమలూరు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారంటూ ఫ్లెక్సీలతో ప్రదర్శనకు దిగారు. టీడీపీ నేతలను అడ్డుకునేందుకు బ్రిడ్జ్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే అరెస్ట్‌ చేస్తే బ్రిడ్జిపై నుంచి దూకేస్తామని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హెచ్చరించారు. దీంతో యనమలకుదురు బ్రిడ్జి ఉద్రిక్త వాతావవరణం నెలకొంది.

Updated Date - 2022-11-22T13:09:39+05:30 IST