TDP Leader: ఎమ్మెల్యే వసంత కృష్ణపై దేవినేని ఉమా ఫైర్

ABN , First Publish Date - 2022-12-20T14:31:01+05:30 IST

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP Leader: ఎమ్మెల్యే వసంత కృష్ణపై దేవినేని ఉమా ఫైర్

అమరావతి: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ (Mylavaram MLA Vasantha Krishna Prasad)పై మాజీ మంత్రి దేవినేని ఉమా (Former minister Devineni Uma) ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపరుడైన కొండపల్లి మున్సిపల్ కమిషనర్‌ను అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కోట్ల రూపాయలు గడిస్తున్నారని ఆరోపించారు. వీటీపీఎస్ బూడిద కోసం ఎమ్మెల్యే, మంత్రి వర్గాలుగా రోడ్డున పడి కొట్టుకుంటున్నారన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ అవినీతిని బయటపెడుతున్నానని తనపై విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అవినీతి అంతా ముఖ్యమంత్రి ముందే ఆ పార్టీ కార్యకర్తలే బయట పెట్టారన్నారు. తాడేపల్లి కొంపలో ఆరోజు రెండు గంటలు ఏం జరిగిందో చెప్పే దమ్ము కృష్ణ ప్రసాద్ ఉందా అని ప్రశ్నించారు. ఒకేరోజు మూడు పార్టీలు మార్చిన బతుకులు ఎమ్మెల్యే వి అని వ్యాఖ్యలు చేశారు. సొంత బంధువుని బినామీ ఆస్తుల కోసం చంపిన చరిత్ర వీరిదన్నారు. టీడీపీ ప్రభంజనంలో వసంత కృష్ణ ప్రసాద్ లాంటి రాజకీయ వ్యభిచారులు ఊసరవెల్లులు కొట్టుకుపోవడం ఖాయమని దేవినేని ఉమా స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-20T14:31:02+05:30 IST