Minister Roja: ఏపీ కళాకారులంటే ఆషామాషీ కాదు

ABN , First Publish Date - 2022-12-19T12:35:17+05:30 IST

రాష్ట్రంలో నాలుగు జోన్లలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహించామని మంత్రి ఆర్కే రోజా తెలిపారు.

Minister Roja: ఏపీ కళాకారులంటే ఆషామాషీ కాదు

విజయవాడ: రాష్ట్రంలో నాలుగు జోన్లలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహించామని మంత్రి ఆర్కే రోజా (Minister RK Roja) తెలిపారు. సోమవారం మీడియాతో మీట్లాడుతూ... నాలుగు జోన్లలో ప్రతిభ కనబర్చిన వారికి ఫైనల్స్ నిర్వహిస్తున్నామని... ఎంత టాలెంట్ ఉన్నా ప్రోత్సాహం, గుర్తింపు ఉండాలని అన్నారు. కళాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తాను కూడా కళాకారుల కుటుంబ సభ్యురాలినే అని అన్నారు. మన కళలను భవిష్యత్ తరాలకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని తెలియజేశారు. నాలుగు జోన్లలో నిర్వహించిన సాంస్కృతిక సంబరాల్లో ఎంతో మంది కళాకారులను గుర్తించామన్నారు. ‘‘ఏపీ కళాకారులంటే ఆషా మాషీ కాదు... అద్భుతమైన టాలెంట్ ఉన్నవారని అందరికీ తెలిసిందే’’ అని మంత్రి రోజా పేర్కొన్నారు.

Updated Date - 2022-12-19T12:35:18+05:30 IST