Anandababu: జగన్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం

ABN , First Publish Date - 2022-12-31T14:13:36+05:30 IST

వైసీపీ ప్రభుత్వం(YCP Govt.)పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు (Nakka Anandababu) నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌ (Cm jagan)పై ఫైరయ్యారు. ‘‘కందుకూరు (Kandukuru) విషాద

Anandababu: జగన్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం
తీవ్ర ఆగ్రహం

అమరావతి: వైసీపీ ప్రభుత్వం(YCP Govt.)పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు (Nakka Anandababu) నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌ (Cm jagan)పై ఫైరయ్యారు. ‘‘కందుకూరు (Kandukuru) విషాద ఘటనపై మానవత్వం ఉన్నవారంతా అయ్యోపాపం అన్నారు. వైసీపీ నేతలు (YCP leaders), ఆ పార్టీ పేటీఎమ్ బ్యాచ్ (Paytm Batch) మాత్రం దుష్టప్రచారంతో వికృతానందం పొందుతోంది. జగన్ రెడ్డి ఆదేశాలతోనే కందుకూరు ఘటనపై విష ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారు. నర్సీపట్నం సభలో ముఖ్యమంత్రి మాటలు విన్నాక.. ఆయన తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని అర్థమైంది. ప్రభుత్వ, పోలీస్ వైఫల్యం వల్ల జరిగిన దుర్ఘటనను జగన్ రెడ్డి సిగ్గులేకుండా రాజకీయం చేస్తున్నారు. జనాల్ని కూడా సాంకేతిక పరిజ్ఞానంతో సృష్టించడం నీకు, నీ సాక్షి మీడియాకే తెలుసు జగన్ రెడ్డి. నీకులాగా పార్ట్ టైమ్ పాదయాత్రలు చేయడం, ప్రజల్ని గ్రాఫిక్స్‌లో చూపడం మాకు, మా పార్టీకి తెలియదు. చంద్రబాబు (Chandrababu) సభలకు వస్తున్న జన సునామీలు చూసి నీకు వెర్రిపట్టింది. అదే జన సునామీ జగన్ సర్కార్‌ని ముంచెత్తే రోజు దగ్గర్లోనే ఉంది. నీకున్న ప్రచారపిచ్చి దేశంలో ఎవరికీ ఉండదు జగన్ రెడ్డి. జాతీయ నాయకుల పేర్లు కూడా తీసేసి.. పథకాలకు నీ పేర్లే పెట్టావు. జాతీయ చిహ్నాలు, పిల్లలు తినే కోడిగుడ్లు, స్కూల్ బ్యాగులు (School bags), షూలపై కూడా నీ పార్టీ రంగులేయించావు. ప్రభుత్వ ప్రకటనల్లో ఒక్కమంత్రి ఫోటో కనపడదు.. నీ ఫొటో తప్ప. రైతుల పాస్ పుస్తకాల (Farmers pass books)పై నీ బొమ్మలేంటి జగన్ రెడ్డి. అది నీ ప్రచారపిచ్చికాదా? నీ సభలకు జనాన్ని రప్పించడానికి వాలంటీర్లు (Volunteers), వైసీపీ నేతల్ని వాడుకుంటున్నావు. వచ్చిన అరకొర జనాన్ని పారిపోకుండా చూడటానికి పోలీసుల్ని అడ్డంపెట్టుకుంటున్నావు. నీ ప్రచారపిచ్చి, నీ చేతగాని విధానాలతో నీ పార్టీ ఎమ్మెల్యే (ycp mlas)లే విసుగెత్తిపోయారు.’’ అని నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు.

Updated Date - 2022-12-31T14:13:38+05:30 IST