AP News: ఫార్మా కంపెనీలో మృతుల కుటుంబాలకు రూ. 25లక్షల పరిహారం

ABN , First Publish Date - 2022-12-26T23:08:31+05:30 IST

Amaravathi: అనకాపల్లి జిల్లా లారెస్ ఫార్మా కంపెనీలో మృతిచెందిన ఐదుగురు కార్మికుల కుటుంబాలకు సీఎం జగన్ రూ. 25 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం

AP News: ఫార్మా కంపెనీలో మృతుల కుటుంబాలకు రూ. 25లక్షల పరిహారం

Amaravathi: అనకాపల్లి జిల్లా లారెస్ ఫార్మా కంపెనీలో మృతిచెందిన ఐదుగురు కార్మికుల కుటుంబాలకు సీఎం జగన్ రూ. 25 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

కాగా ఫార్మా కంపెనీలో ఘటన దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మృతుల కుటుంబాలకు న్యాయబద్ధ ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు అన్ని విధాలుగా ఆదుకోవాలని జనసేన (Janasena) పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోరారు. విశాఖ (Vizag) ప్రాంత పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పరిశీలించాల్సినఅధికారులు ఏ మేరకు పని చేస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రతి పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని పవన్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-12-26T23:08:33+05:30 IST