Sunitha Reddy: సోదరా.. బ్యాండేజీతో డ్రామాలొద్దు

ABN, Publish Date - Apr 25 , 2024 | 05:07 PM

తన తండ్రి వైయస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసి అయిదేళ్లు పూర్తి అయింది. ఆ కేసులో నిందితులను నేటికి అరెస్ట్ చేయలేదు. అంతేకాకుండా... ఈ హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వేళ.. అతడికి మళ్లీ కడప లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

తన తండ్రి వైయస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసి అయిదేళ్లు పూర్తి అయింది. ఆ కేసులో నిందితులను నేటికి అరెస్ట్ చేయలేదు. అంతేకాకుండా... ఈ హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వేళ.. అతడికి మళ్లీ కడప లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

అలాగే వైయస్ అవినాష్‌ రెడ్డికి మద్దతుగా వైయస్ జగన్ సైతం ప్రచారం నిర్వహిస్తున్నారు. అంటే.. సొంత చిన్నాన్నాను హత్య చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎలా మద్దతు ఇస్తారంటూ వైయస్ జగన్‌ని వైయస్ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి సూటిగా ప్రశ్నిస్తుంది. మరోవైపు వైయస్ వివేకా హత్య కేసులో వైయస్ జగన్ వ్యవహారశైలిని ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ వైయస్ షర్మిలతోపాటు సునీత నర్రెడ్డి ఎండగడుతున్నారు.

ఈ నేపథ్యంలో వీరిద్దరిని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు ఆడిస్తున్నారంటూ.. వైయస్ జగన్ అండ్ కో ఆరోపణలు గుప్పిస్తుంది. ఇక మేము సిద్దం బస్సుయాత్రలో వైయస్ జగన్‌పై ఆగంతకుడు రాయి విసిరాడు. దీంతో ఆయన నుదిటికి గాయమైంది. ఆ క్రమంలో సీఎం వైయస్ జగన్ నుదిటికి బ్యాండేజ్ వేసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోదరా.. బ్యాండేజీ డ్రామాలొద్దు అంటూ వైయస్ జగన్‌కు సునీత నర్రెడ్డి వ్యంగ్యంగా సూచిస్తుంది.

Read National News and Telugu News

Updated at - Apr 25 , 2024 | 05:21 PM