Share News

TG Elections 2024: రేవంత్‌తో ముగిసిన సీపీఎం నేతల భేటీ.. ఆ సీటు త్యాగం

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:35 PM

లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీ అభ్యర్థిని పోటీలో నిలిపిన సీపీఎం(CPM).. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. ఇదే అంశంపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సీపీఎం నేతలు శనివారం భేటీ అయ్యారు.

TG Elections 2024: రేవంత్‌తో ముగిసిన సీపీఎం నేతల భేటీ.. ఆ సీటు త్యాగం

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీ అభ్యర్థిని పోటీలో నిలిపిన సీపీఎం(CPM).. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. ఇదే అంశంపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సీపీఎం నేతలు శనివారం భేటీ అయ్యారు.

ఓట్లు చీలుతాయనే కారణంతో సీపీఎం అభ్యర్థిని పోటీ నుంచి తప్పించాలని కాంగ్రెస్ విన్నవించింది. ఈ అంశంపై అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న సీపీఎం.. సీఎంతో భేటీ అనంతరం ఓ నిర్ణయానికి వచ్చింది.


ఇవాళ సాయంత్రంలోపు భువనగిరి విషయంపై తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని నేతలు సీఎంకు చెప్పినట్లు తెలిసింది. బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌తో కలిసి నడుస్తామని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Telangana and Telugu News Here

Updated Date - Apr 27 , 2024 | 12:36 PM