Share News

PM Modi: రాహుల్.. నిన్ను వాయనాడ్ నుంచి తరిమికొడతారు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 20 , 2024 | 03:34 PM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని(Rahul Gandhi) తన పార్లమెంటరీ నియోజకవర్గం వాయనాడ్(Wayanad) నుంచి ప్రజలు తరిమికొడతారని, ఆయన మరో సీటు వెతుక్కోవాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) శనివారం జోస్యం చెప్పారు.

PM Modi: రాహుల్.. నిన్ను వాయనాడ్ నుంచి తరిమికొడతారు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని(Rahul Gandhi) తన పార్లమెంటరీ నియోజకవర్గం వాయనాడ్(Wayanad) నుంచి ప్రజలు తరిమికొడతారని, ఆయన మరో సీటు వెతుక్కోవాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) శనివారం జోస్యం చెప్పారు.

మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. రాహుల్ యువరాజు వయనాడ్‌లో కూడా ఓడిపోతారని, తరువాత మరో సురక్షిత స్థానం చూసుకోవాల్సి ఉంటుందని విమర్శలు గుప్పించారు.


మొదటి దశ పోలింగ్‌లో ఎన్డీయేకు ఏకపక్షంగా ఓట్లు పడినట్లు తెలుస్తోందన్నారు. "అమేథీలో గతంలో ఓడిపోయిన కాంగ్రెస్ యువరాజు.. వయనాడ్‌లోనూ ఓడిపోనున్నారు. విపక్ష ఇండియా కూటమికి చెందిన కొందరు నేతలు(సోనియా గాంధీ) లోక్ సభను వదిలి, రాజ్యసభకు వెళ్లిపోతున్నారు.

Priyanka Gandhi: అర్థం లేని వ్యాఖ్యలపై స్పందించను.. కంగన కామెంట్లపై ప్రియాంక గాంధీ ఆగ్రహం

వారికి ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదు. గత కాంగ్రెస్ హయాంలో జరిగిన పాలనా పరమైన సమస్యలు చక్కదిద్దేందుకు పదేళ్లు పట్టింది. దేశానికి ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది. ఇండియా కూటమి అవినీతి అక్రమాలను కాపాడుకోవడానికి కలిసి వచ్చిన స్వార్థపరుల గుంపు" అని మోదీ అన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2024 | 03:39 PM