Share News

Bandi Sanjay: కేసీఆర్ ఏమైనా సుద్ద పూసా? వేస్ట్ ఫెల్లో ఆఫ్ ఇండియా..

ABN , Publish Date - May 10 , 2024 | 01:05 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోసపుమాటలు నమ్మవద్దని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ కలుగులో ఎలుక లాంటివాడని.. పెద్ద బ్లాక్ మెయిలర్ అని విమర్శించారు. కేసీఆర్‌ ఒక వేస్ట్ ఫెల్లో ఆఫ్ ఇండియా అని విమర్శించారు. కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నాడని.. ఆయనేమైనా సుద్ద పూసా? అని ప్రశ్నించారు.

Bandi Sanjay: కేసీఆర్ ఏమైనా సుద్ద పూసా? వేస్ట్ ఫెల్లో ఆఫ్ ఇండియా..

కరీంనగర్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మోసపుమాటలు నమ్మవద్దని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. కేసీఆర్ కలుగులో ఎలుక లాంటివాడని.. పెద్ద బ్లాక్ మెయిలర్ అని విమర్శించారు. కేసీఆర్‌ ఒక వేస్ట్ ఫెల్లో ఆఫ్ ఇండియా అని విమర్శించారు. కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నాడని.. ఆయనేమైనా సుద్ద పూసా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కంటే పెద్ద బ్లాక్ మెయిలర్ ఉంటాడా.. ఆయన మగాడైతే సరిహద్దుల్లోకి వెళ్లి పుల్వామాపై మాట్లాడాలంటూ సవాల్ విసిరారు. పుల్వామా ఘటనపై మాట్లాడితే కేసీఆర్‌ను కాల్చి పడేస్తారన్నారు. దేశాన్ని కేసీఆర్ అవమానిస్తున్నారన్నారు.

YS Viveka Case: ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ సునీత


‘కరీంనగర్‌లో వినోద్ గెలిస్తే.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా.. నేను గెలిస్తే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అంటూ కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చేసి జై శ్రీరామ్ అనొద్దంటాడని.. కాంగ్రెస్ ఏమో అయోధ్య అక్షింతలు కావని అంటోందన్నారు. కేసీఆర్ ఏమో ముస్లింలను పొగుడుతున్నాడన్నారు. వీళ్లంతా గలీజ్ గాళ్ళ మాదిరిగా ఉన్నారని బండి సంజయ్ అన్నారు. తనను ఓడించేందుకు ముస్లింలంతా ఒక్కటి కావాలా కేసీఆర్ అని ప్రశ్నించారు. ముస్లింల ఓట్లను కేసీఆర్ కొంటున్నారని బండి సంజయ్ విమర్శించారు.

ఇవి కూడా చదవండి..

Hyd News: మద్యం ప్రియులకు కీలక అప్‌డేట్.. రేపటి నుంచి..

AP Election 2024: వైసీపీ కోసం.. లూప్‌లైన్‌ ‘వ్యూహం’

Read more Telangana News and Telugu News

Updated Date - May 10 , 2024 | 01:05 PM