Share News

YSRCP: తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్‌రెడ్డికి ఊరట.. ఆ పిటిషన్ కొట్టివేత

ABN , Publish Date - May 03 , 2024 | 11:07 AM

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి (MP Avinash Reddy) తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మాజీ మంత్రి వైఎస్ వివేక(YS Vivekananda Reddy) హత్య కేసులో అవినాశ్‌ బెయిల్‌ని(Bail) రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు కొట్టేసింది.

YSRCP: తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్‌రెడ్డికి ఊరట.. ఆ పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి (MP Avinash Reddy) తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మాజీ మంత్రి వైఎస్ వివేక(YS Vivekananda Reddy) హత్య కేసులో అవినాశ్‌ బెయిల్‌ని(Bail) రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు కొట్టేసింది.

ఈ కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.


దస్తగిరి తరఫున ప్రముఖ న్యాయవాది జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు అవినాశ్‌రెడ్డికి ఊరటనిచ్చే తీర్పువెలువరించింది. దీంతో అవినాష్ రెడ్డి బెయిల్ కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసినట్లయింది.


భాస్కర్ రెడ్డికీ బెయిల్...

వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి...

Hyderabad: ‘మహా’ అధికారికి ఏసీబీ నోటీసులు.. ఇప్పటికే పలు దఫాలుగా వివరణ

YS Sharmila: వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటం..

Read Latest AP News And Telugu News

Updated Date - May 03 , 2024 | 11:12 AM