Share News

TS HighCourt: దిశ నిందితుల ఎన్‌కౌంటర్.. పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు స్టే

ABN , Publish Date - May 01 , 2024 | 04:31 PM

Telangana: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసు అధికారులకు ఊరట లభించింది. సిర్పూర్ కమిషన్ నివేదిక ఆధారంగా సదరు అధికారులపై చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై ఏడుగురు పోలీసు అధికారులు, షాద్నగర్ తహసిల్దార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు(బుధవారం) ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగగా..

TS HighCourt: దిశ నిందితుల ఎన్‌కౌంటర్.. పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు స్టే

హైదరాబాద్, మే 1: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో (Disha accused encounter case) పోలీసు అధికారులకు ఊరట లభించింది. సిర్పూర్ కమిషన్ నివేదిక ఆధారంగా సదరు అధికారులపై చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు (Telangana HighCourt) స్టే విధించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై ఏడుగురు పోలీసు అధికారులు, షాద్నగర్ తహసిల్దార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు(బుధవారం) ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగగా.. పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవద్దంటూ జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి స్టే విధించారు.

Pawan Kalyan: చిరంజీవిని అవమానిస్తారా?.. జగన్‌కు టైం దగ్గరపడింది...


దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిర్పూర్ కమిషన్‌ను సుప్రీంకోర్టు నియమించింది. ఈ క్రమంలో సిర్పూర్ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు పలువురిని విచారించింది. చివరకు దిశా నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిర్పూర్ కమిషన్ సూచించింది. అయితే సిర్పూర్ కమిషన్ నివేదిక సరిగ్గా లేదంటూ హైకోర్టులో పోలీసు అధికారులు పిటిషన్‌ వేయగా.. విచారణ జరిపిన కోర్టు వారిపై చర్యలు తీసుకోవద్దంటూ స్టే విధించింది.


ఇవి కూడా చదవండి...

CM Revanth: తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చింది ‘గాడిద గుడ్డు’.. రేవంత్ ట్వీట్

AP News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడ్డాయోచ్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 01 , 2024 | 04:52 PM