దిగొచ్చిన బీసీసీఐ.. దెబ్బకు అంతా సెట్

విదేశీ టూర్ల టైమ్‌లో ఆటగాళ్ల ఫ్యామిలీస్‌ను అనుమతించడంపై బీసీసీఐ కొత్త పాలసీ తీసుకొచ్చింది. 

45 రోజులకు మించిన టూర్లలో 14 రోజులే ఫ్యామిలీని అనుమతిస్తారు. అదీ టూర్ స్టార్ట్ అయిన రెండు వారాల తర్వాతే. 

45 కంటే తక్కువ రోజుల పర్యటనల్లో ఒక వారమే కుటుంబ సభ్యులకు పర్మిషన్ ఇస్తారు. 

ఈ తలతిక్క రూల్ అవసరమా అంటూ బీసీసీఐపై ఇటీవల కోహ్లీ గరం అయ్యాడు.

ఫ్యామిలీతో గడిపితే ఒత్తిడి నుంచి బయటపడి నార్మల్ అవుతామని కోహ్లీ స్పష్టం చేశాడు. 

విరాట్ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకున్న బోర్డు పెద్దలు.. ఆటగాళ్లను కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం ఉండేందుకు చాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారట.

ఫ్యామిలీస్‌ను టూర్లలో తెచ్చుకునేందుకు కోచ్ గంభీర్, కెప్టెన్‌తో పాటు జీఎం ఆపరేషన్స్ పర్మిషన్ తీసుకోవడం కంపల్సరీ అని తెలుస్తోంది.