హనుమయ్య సేవలో కోహ్లీ..  ఏం మొక్కుకున్నాడో తెలుసా..!

సతీమణి అనుష్క శర్మతో కలసి అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ గఢి ఆలయాన్ని సందర్శించాడు విరాట్.

ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్ మ్యాచులు త్వరలో షురూ కానున్న నేపథ్యంలో ఆర్సీబీని గెలిపించాలని హనుమయ్యను కోహ్లీ ప్రార్థించి ఉండొచ్చని నెటిజన్స్ అంటున్నారు.

ఈసారి కప్పు కలను నిజం చేయాలని మొక్కుకొని ఉండొచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల టెస్టులకు గుడ్‌బై చెప్పిన కింగ్.. వెంటనే బృందావన్‌లోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి వెళ్లాడు.

గతంలో ఉజ్జయిన్‌లోని ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు కోహ్లీ దంపతులు.

వీలున్నప్పుడల్లా పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటాడు విరాట్.

దేశ సంస్కృతి, సంప్రదాయాలకు కోహ్లీ దంపతులు ఇస్తున్న ప్రాధాన్యతను అంతా మెచ్చుకుంటున్నారు.