టీమిండియాలో సంచలన మార్పులు..  బీసీసీఐ ధైర్యానికి కారణం!

భారత క్రికెట్‌లో నవ శకం మొదలైంది. సారథ్యం దగ్గర నుంచి చాలా విషయాల్లో అనూహ్య మార్పులు జరిగాయి.

రోహిత్ వారసుడిగా గిల్‌ను ఎంపిక చేసింది బోర్డు. వైస్ కెప్టెన్‌గా పంత్‌కు ప్రమోషన్ ఇచ్చింది.

ఇంగ్లండ్ టూర్ కోసం 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును బోర్డు ప్రకటించింది.

రిటైర్‌మెంట్ ఇచ్చేసిన రోహిత్-కోహ్లీ స్థానంలో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు చోటు కల్పించింది.

రోకో స్థానంలో కరుణ్ నాయర్, సాయి సుదర్శన్‌ను జట్టులోకి తీసుకున్నారు.

గిల్-పంత్‌కు జట్టును నడిపించే బాధ్యతలు అప్పగించడం, యువ ఆటగాళ్లకు టీమ్‌లో పెద్దపీట వేయడం వెనుక కోచ్ గంభీర్ ఇచ్చిన హామీనే కారణమని తెలుస్తోంది.

జట్టులో సుస్థిర స్థానం దక్కించుకోవాలనే కసి యువకుల్లో ఉంటుంది కాబట్టి భారీ మార్పులకు బీసీసీఐ శ్రీకారం చుట్టిందని సమాచారం.