రూల్స్ అడ్డగోలుగా మార్చేస్తారా..  ఫ్రాంచైజీలు సీరియస్!

బీసీసీఐపై గుర్రుగా ఉన్నాయట ఫ్రాంచైజీలు.

ముఖ్యంగా కేకేఆర్ బోర్డుపై కోపంగా ఉందట. దీనికి కారణం 2 గంటల రూల్ అని తెలుస్తోంది.

ఈ సీజన్‌లో ఇకపై జరిగే ప్రతి మ్యాచ్‌కు అదనంగా 120 నిమిషాలు కేటాయించింది బీసీసీఐ. వాన పడినా ఫలితం రాబట్టాలనే ఉద్దేశంతో ఇలా చేసిందట.

మే 17న జరిగిన ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఆ మ్యాచ్‌లో 2 గంటల రూల్ లేకపోవడం కోల్‌కతాను దెబ్బకొట్టింది.

ఒక్కో మ్యాచ్‌కు ఒకలా నిబంధనలు మార్చడం మీద కేకేఆర్ యాజమాన్యం సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

ఆర్సీబీతో మ్యాచ్ జరిగి, అందులో నెగ్గి ఉంటే కేకేఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండేవి.

లీగ్ నడుమ ఇలా రూల్స్ మార్చడంపై ఇతర ఫ్రాంచైజీలు కూడా బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.