టీమిండియాకు బిగ్ షాక్..  ఎంత పని చేశావ్ షమి!

5 టెస్టుల సిరీస్‌ కోసం త్వరలో ఇంగ్లండ్‌‌కు పయనం కానుంది భారత జట్టు.

రోహిత్-కోహ్లీ గైర్హాజరీలో ఈ సిరీస్‌లో మెన్ ఇన్ బ్లూ ఎలా ఆడుతుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

సీనియర్ పేసర్ మహ్మద్ షమి ఈ సిరీస్‌కు దూరమయ్యే చాన్స్ ఉన్నట్లు వినిపిస్తోంది.

షమి టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్స్ వేసే అవకాశం లేదని బీసీసీఐకి డాక్టర్ల బృందం తేల్చిచెప్పిందట.

షమీని బలవంతంగా ఆడిస్తే.. ఒకవేళ మళ్లీ గాయమైతే కెరీర్‌కే ప్రమాదమని బోర్డు పెద్దలు అనుకుంటున్నారట.

ఇంగ్లండ్ సిరీస్‌కు షమీని దూరంగా ఉంచాలని భావిస్తున్నారట.

ఇంగ్లండ్ సిరీస్‌ ప్రాధాన్యత దృష్ట్యా ఐపీఎల్‌లో ఆడకుండా ఉండే బాగుండేది కదా, ఎంత పని చేశావ్ షమి అని సోషల్ మీడియాలో నెటిజన్స్ వాపోతున్నారు.