బుమ్రాకు అన్యాయం..  ఆ రూల్స్ మర్చిపోయారా!

భారత టెస్ట్ జట్టుకు నయా కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను నియమించింది బీసీసీఐ.

నిన్న మొన్నటి వరకు బుమ్రానే తదుపరి సారథి అంటూ పుకార్లు వినిపించాయి. అయితే అతడికి కాదని గిల్‌కు పగ్గాలు అప్పగించింది బోర్డు.

బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకపోవడం సరికాదంటూ మండిపడ్డాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.

మొత్తం సిరీస్ ఆడలేడనే కారణంతో కెప్టెన్‌గా ఎంపిక చేయకపోవడం సరైన నిర్ణయం కాదన్నాడు మంజ్రేకర్.

రోహిత్-విరాట్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు పలు సిరీస్‌ల్లో పూర్తి మ్యాచులు ఆడలేదని గుర్తుచేశాడు.

రోకోకు వర్తించని రూల్.. బుమ్రాకు ఎందుకు వర్తించిందని మంజ్రేకర్ ప్రశ్నించాడు.

బుమ్రాను కెప్టెన్ చేయకపోవడంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ కూడా సీరియస్ అవుతున్నారు.